24, డిసెంబర్ 2009, గురువారం

మళ్ళీ అక్కడ మొదలైంది...

ఇక్కడి వాళ్ళకు (అంటేరాయలసీమ మరియు కోస్తాంధ్ర వాళ్లకన్నమాట) కాస్త రెస్ట్ తీసుకోమ్మన్నారు... అక్కడ తెలంగాణా వాళ్ళకు మళ్ళీ బంద్ లు చేసుకొమ్మని అనుమతి నిచ్చారు... శ్రీమాన్ కే సి ఆర్ గారు గర్జించిన బెబ్బులి లా వస్తానన్నారు కదా... బొబ్బిలి బెబ్బులి ... పటపట పళ్ళు కొరుకుతూ , చట చట చట చట ముందు కురుతుకూ, ..... ఇలా కొంత కాలం సమైఖ్యాంధ్ర అంటూ కొన్ని తగలపెడతారు. ..... కొంత కాలం తెలంగాణా అంటూ తగలపెడతారు... తరువాత తినడానికి ఏమీ దొరకక అన్నీ కాల్చగా మిగులుతుంది కదా... బూడిద... అది తిని చదువు కుంటారు... రెండు వేల పన్నెండు నాటికి ప్రపంచం నాశనం అవుతుందని సినిమా తీశారు... అది జరుగుతుందో లేదో కాని, భారత దేశ పటంలో ఆంద్ర ప్రదేశ్ (అంటే తెలంగాణా, సీమాంధ్ర) మిగులు తుందో ... లేదో...
"నా కేదో సంశయం గానే ఉంది ... ఈ జగత్తు ఎన్నడు చితికి పోతుందో అని... ఏదో సందియం గ ఉంది ఏ నగరం హిరోషిమా కనుందో అని" అన్నారు కదా డా.సి.నా.రే. గారు... ఆ నగరం ఏమిటో తెలుసా... ..... ఆ ... అది...
మురళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి