6, జనవరి 2010, బుధవారం

శుభారంభం...

కొత్త సంవత్సరం ప్రభుత్వ కానుకల పరంపర ప్రారంభమయ్యింది... బస్సు చార్జీల రూపంలో నాంది పలికింది... నూటికి కనీసం ఇరవై ఐదు రూపాయల చొప్పున వాయింపు .... ఇది ఆరంభం మాత్రమె... రెండు రూపాయల కిలో బియ్యం, ఉచిత విద్యుత్తు, పావలా వడ్డీ రుణాలు... అంటూ అధికారంలోకి వచ్చిన జాతీయ పార్టీ... ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామన్న వ్యక్తీ చనిపోయి బ్రతికి పోయాడు... లేకపోతే ఇవన్నీ అమలు చేయాలంటే ఆయన మాత్రం ఎలా తెస్తాడు? పది కే.జి. ల బియ్యం రెండు రూపాయల చొప్పున ఇచ్చి, మార్కెట్ లో కిలో బియ్యం ముప్పై దాటించారు... పప్పులు, పలు, ఉప్పులు, మిగిలిన వాటి సంగతి సరేసరి... జల ప్రలయాలోచ్చి కూర గాయల ధరలు నింగి కేగ సాయి. సమ్మెలు, రాస్తారోకోలు, ప్రత్యెక వాదాలు, సమైఖ్య రాగాలు, తగలపెట్ట డాలు... తన్నుకోవ డాలు, .... ధరలు పెంచడానికి, వద్దను కున్న లేదా భారమనిపిస్తున్న పథకాలురద్దు చేయడానికి ఇదే మంచి అనువైన సమయం... ఆర్ధిక మాంద్యం వచ్చి ఉద్యోగాలు పోతున్నై... ఇంక్రిమెంట్లు ఆగి పోయాయి... సారి కదా ఉన్న జీతాలు తగ్గిపోతున్నై... (ప్రస్తుతం ఆ తగ్గిన జీతల తోనే బ్రతుకు తున్నాం కదా... నాలాంటి వాళ్ళు...) , మేడి పండు పథకాలు కొన్ని ధరలు పెంచాయి... ప్రకృతి కన్నెర్ర కు కొంత ధరలు పెరిగాయి... మనుషుల మూర్ఖత్వం వాళ్ళ కొన్ని ధరలు పెరుగు తున్నై... రేపు ప్రత్యెక రాష్ట్రాలుగా ఏర్పడితే కొత్త కొత్త ఖర్చులు, కొత్త కొత్త పన్నులు... కొత్త కొత్త ఇబ్బందులు... బందులు...

ఇప్పుడు నాకు మరో డౌట్ వచ్చింది... ఈ పండగలకీ పబ్బాలకీ ఆర్.టి.సి. వాళ్ళు ఏభై శాతం ఎక్కువ ఛార్జ్ వసూల్ చేస్తారు కదా... అది ఈ కొత్త ఛార్జ్ మీద కూడా ఉంటుందా... అలా ఉంటె మన మధ్య తరగతి లెక్క ప్రకారం వంద రూపాయల మీద డెబ్భై ఐదు రూపాయలు ఎక్కువ దొబ్బుడు .... ప్రైవేట్ బస్సులు ఇప్పటికే హైదరాబాద్ నుండి రాజమండ్రి కి మూడు వందల ఏభై వసూల్ చేస్తున్నారు... రాను రానూ.. నేను పండగకి "రాను రానూ"... అనే పరిస్తితి వచ్చేట్టుంది... అన్ని పరిస్థితులకీ అలవాటు పడటం మనకు అలవాటే కదా...
మురళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి