26, ఆగస్టు 2009, బుధవారం

ప్రజా రాజ్యం పార్టి ఆవిర్భావ దినోత్సవం

ప్రజా రాజ్యం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టి జిల్లా కన్వీనర్ లెఫ్టినెంట్ జాస్తి మూర్తి గారు నగరంలో పలుచోట్ల పార్టి జండాను ఎగురవేసారు. ధవళేస్వరం, శాటిలైట్ సిటీ, గో రక్షణ పేట, పదమూడవ వార్డు, హుకుంపేట మొదలైన పలు ప్రాంతాలలో జండా ఎగుర వేసారు. కార్యకర్తలకు ఈ సందర్భంగా మిఠాయిలు పంచి పెట్టారు. నగరంలో ప్రముఖులైన మేడా గురుదత్త ప్రసాద్, అన్నందేవుల చంటి, వై.శ్రీనివాస్, సుంకర శ్రీహరి, కడియం బాబు, హారిక, నాలా పద్మశ్రీ, సుంకర మధు మొదలైన వారంతా ఆ యా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన వారందరికీ లెఫ్టినెంట్ మూర్తి గారు కృతజ్ఞతలు తెలియ జేశారు. రానున్న కాలంలో పార్టి మరింత బలపడాలని ఆకాంక్ష వ్యక్తం చేసారు. పార్టి అధినేత శ్రీ చిరంజీవి గారికి, ఇతర రాజకీయ ప్రముఖులకు శుభా కాంక్షలు తెలియ జేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి