12, ఏప్రిల్ 2010, సోమవారం

చాల కాలానికి ... బ్లాగ్ లోకి వచ్చాను... కొంచెం బిజీ... అంతే కాక ఏదో వ్రాయాలని ప్రారంభించి ఏదేదో వ్రాసేస్తున్నాను.. సుత్తి కొడితే చదివే వాళ్లకి మండి కామెంట్ కాలంతో దాడి చేస్తారని భయం... హరి సర్ ... రెస్పాన్స్ చూసి మళ్ళీ ... ఒకటి రెండు ముక్కలు వ్రాద్దామని కూర్చున్నాను... ఈ మధ్య షేర్ మార్కెట్ లో ఐ.సి.ఐ.సి.ఐ. డైరెక్ట్ వారి సూచనల ప్రకారం కొన్న షేర్ లు పాతాళం లోకి పోవడంతో ఒళ్ళు మండి ఐదు వందలు పోతే పోయింది అని నష్టానికి అమ్మి పడేసాను... ఇంకా లాభం లేదనుకొని ఒక్క వెయ్యి రూపాయలు పెట్టి ఆంధ్ర బ్యాంకు షేర్ లు వంద రూపాయల చొప్పున కొన్నాను... అలవాటు ప్రకారం తొంబై ఎనిమిది వరకూ దిగిపోయింది... కాని వారం లోపే నూట ఇరవై దాటింది... ఇంకా పెరుగుతుందేమో అన్న ఆశ మనసును తొలిచేస్తున్నా అమ్మేసాను... అమ్మేసాక తగ్గడం ప్రారంభించింది అనుకోండి... ఐనా.. ఆంద్ర బ్యాంకు, లాంటి షేర్ లు లాంగ్ టైం వరకూ హోల్డ్ చేసుకో వచ్చు... ముఖ్యంగా ఈ బ్యాంకు షేర్ లలో రిస్క్ తక్కువ... ఎందుకంటె అది నాకు అనుభవపూర్వకంగా తెలుసు... అసలు నా షేర్ మార్కెట్ జీవితం బ్యాంకు షేర్ ల తోనే స్టార్ట్ అయ్యింది... పంతొమ్మిది వందల తొంబై ఆరు లో బ్యాంకు అఫ్ ఇండియా షేర్ లను నలభై ఐదు రూపాయలకు కొన్నాను... ఐదేళ్ళ తరువాత వంద రూపాయలకు అమ్మేసాను... అదే బ్యాంకు అఫ్ ఇండియా షేర్ ధర ఇప్పుడు మూడు వందలు దాటి.. ఉంది.. అనుకుంటాం కాని ముతుఅల్ ఫండ్ సేఫ్ అని... దేనికీ దానికీ పెద్ద తేడ ఏమీ లేదు... ఆ దరిద్రపు రిలయన్స్ నాచురల్ ఫండ్ ఒక్కటి కొన్న నాటికీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా పెరగ లేదు... పెరిగితే పైసా పైసా... తగ్గితే రూపాయి చొప్పున... మరి అంతంత అర్హత లున్న ఫండ్ మేనేజర్ లు ఏమి చేస్తారో...
....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి