12, అక్టోబర్ 2013, శనివారం

తెలుగు వాళ్ళు ఎందుకు విడిపోవాలి ?

నాకు సందేహాలు చాలా ఎక్కువ ... ఒక పట్టాన నా మట్టి బుర్రకు వచ్చిన సందేహానికి సమాధానం ఎవరు ఏ విధంగా చెప్పినా సంతృప్తి కలగదు ... ఉదాహరణకు భూమి గోళాకారం లో ఉంటుందని చదువుకున్నాం ... కాని బల్ల పరుపుగా ఉందేమో నని అనుమానం ... సరే గోళాకారం లో ఉంటె మనం చూసే మ్యాప్ లు పై వ్యూ లోంచి చూస్తె కనిపించేవా ... అని మరో సందేహం ... అలాగే సూర్యుని చుట్టూ భూమి ఏ కోణం లో తిరుగుతుంది ... కుడి నుంచి ఎడమ లేదా ఎడమ నుండి కుడి కా లేక కింద నుండి పైకా ?

ఈ సందేహాలన్నీ ఎలాగూ తీరవచ్చు లేదా తీరక పోవచ్చు ... కానీ తెలుగు వాళ్ళు ఎందుకు విడి పోవాలను కుంటున్నారో అనే సందేహానికి మాత్రం సమాధానం మరీ తెలియ డం లేదు ...

ఆంద్ర వాళ్ళు తెలంగాణా వాళ్ళను దోచుకుంటున్న దొంగలు అంటున్నారు ... నాకు తెలిసినంత వరకూ తెలివైన వాడు తెలివి తక్కువ వాడినీ, బలమైన వాడు బలహీనున్నీ, పెట్టుబడి దారుడు శ్రామి కున్నీ ... ఇలా దోచుకుంటున్నాడు ... బలమైన జాతి బలహీన మైన జాతినీ , బలమైన దేశం బలహీనమైన దేశాన్నీ ... ఈ విధంగా కూడా దోచుకోవడం జరుగుతుంది ...

దోపిడీ ని ఎదుర్కోవాలంటే ఉద్యమం చేయాల్సిందే ... కానీ ఎవరి మీద ? ఎందు కోసం ? అనే విషయం లో స్పష్టత ఉండాలి ... ప్రత్యెక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు ... బాగానే ఉంది ...  అందుకు ఎంచుకునే పధ్ధతి కూడా పధ్ధతి గా ఉండాలి కదా ... సరే ... మీకు నచ్చిన పద్ధతిలో ఉద్యమం చేస్తున్నారు ... విడి పోదామని ... కానీ కలిసి ఉండమని ఉద్యమం చేసే వారికి కామెంట్ చేయడం ఎందుకు ?  కలిసి ఉందామని ఎవరైనా ఉద్యమం చేస్తారా అనేది వీరి ప్రశ్న ... ఒకే ఇంట్లో నివసించే అన్న దమ్ములు ... ఒకడు విడిగా ఉందామని అంటాడు ... మరొకడు కలిసి ఉందామని అంటాడు ... అప్పుడు విడిపోదామని అన్నవాడే ఇంటి నుండి బయటకు పోతాడు ... ఆస్తి పంపకాలు ... తరువాతి సంగతి ... మరి ఇప్పుడు విడిపోతామని అంటున్నవారు ... కలిసి ఉందామని అంటున్న వారిని పొమ్మని అంటున్నారు ... అందుకే ఈ వైపు ఉద్యమం ...

నాన్నకు పెళ్లి అవుతుందని సంబర పడు తున్నారు ... కానీ సవతి తల్లి వస్తుందన్న విషయం గ్రహించడం లేదు ... అన్నట్టు ఉంది ... విడి పోతాం సరే ... మరి ఖర్చులు పెరుగు తాయి ... అది అందరం గ్రహించాలి ... తెల్ల దొరలను దేశం నుండి పంపించి సంబరాలు చేసుకున్నాం ... కానీ పేదరికాన్ని పంపించామా ... వారి మీద ఆధార  మానే మా ? ఏదో ఒక కారణం తో విడి విడి గా ఉన్న రాజ్యాలన్ని ఒక్కటి గా చేసి ఇదీ మీ దేశం ... మీ హిందూ దేశం ... అని చూపిన వారిని శత్రువులని అంటున్నాం ... మతం కోసం దేశాన్ని ముక్కలు  చేసిన వారిని భాయీ అంటున్నాం ... శివాలయం మూసేసి దానిపై కట్టిన సమాధిని ప్రేమ చిహ్నం గా స్వీకరించాం ... హిందూ దేశమని చక్కటి పేరుని కూడా త్యజించి భరతుడు పాలించిన నేల అంటూ భారత దేశం అని నామకరణం చేసాం ... ఇంకా నయం ... ద్రుత రాష్ట్రుడు పాలించాడు కాబట్టి ఆయన పేరు పెట్టలేదు ... 

ఇంతకీ దోచుకునే వాడు ఎవడు ?  దోపిడీకి గురి అవుతున్న వాడు ఎవడు ? అభివృద్ధి చెందిన వాడు ఎవడు ? చెందని వాడు ఎవడు .. మన ఏరియ లో దోచుకుంటే మనం దోచుకోవాలి కానీ ... వేరే ప్రాంతం వాడు దోచుకోవడం ఏమిటి ... అని ఆలోచించే వాడే ... ఈ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నది ... మిగిలిన ప్రాంతాలు మీ ఇష్టం ... అభివృద్ధి చేసిన ప్రాంతం ... మేము స్తిరపడ్డ ప్రాంతం ... ఇక్కడ నుండి పొమ్మన దానికి మీరెవరు అంటూ ఉద్యమం చేస్తున్నవారే సమైక్య వాదులు ... 

ఏది ఎలా జరిగినా నీకూ నాకూ లాభం ఏమిటి మిత్రమా ?  ఒకరిది తిండి లేక చేసే ఉద్యమం అంట ... ఇంకొకరిది తిన్నది అరక్క చేసే ఉద్యమం అట ... నోటి దూల కాక పోతే .... మరేమిటి ...  ఈ ఉద్యమాలన్నీ పై స్తాయిలో వారికే  ఉపయోగం   ... మన లాటి వారు మన కష్టం మీదే ఆధార పడాలి ...


మురళి అనే ఒక అమాయకుని అభిప్రాయం ఇది ... అంతే
 

5 కామెంట్‌లు:

  1. అసలు తెలుగు వాళ్ళు ఎందుకు కలిసి ఉండాలి? హిందీ, బెంగాలీ, తమిళం, పంజాబీ, ఉరుదూ మాట్లాడే వారు ఒకే రాష్ట్రంలో కలిసి ఉన్నారా లేరే?

    రిప్లయితొలగించండి
  2. నా సందేహం మీకు సరిగా అర్థం అయినట్టు లేదు ? నాకు కావలసింది కలిసి వుండటం కన్నా విడిపోవడం వల్ల నా లాంటి సామాన్యులకు లాభం ఏమైనా ఉందా అని ? ముఖ్య గమనిక ఏమిటంటే నేను సీమంధ్ర కు చెందినా వాడిగా అడగడం లేదు ... ఆంధ్ర ప్రదేశ్ కు చెందినా సామాన్య వ్యక్తీ గా అడుగు తున్నాను . ఇక హిందీ ఉర్దూ లాంటి వారితో పోలిక విషయానికొస్తే ... వారే కాదు ... తెలుగు వాళ్ళు కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు ... వేరే దేశాల్లో ఉన్నారు ... ఎవరైనా ముందు వ్యక్తిగత ప్రయోజనం గురించి ఆలోచించాలి కదా ... పై స్థాయిలో వారి లా సామాన్య జనం కూడా తనకు జరిగే లాభ నష్టాల గురించి ఆలోచించుకోవడం అవసరమని నా అభిప్రాయం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రశ్నను ఇలా మార్చి చూద్దాం: "తెలంగాణా ఏర్పడడం వల్ల సామాన్య ప్రజలకు లాభం ఉందా?"

      తెలంగాణా ప్రజలకు (సామాన్యులకు) ఖచ్చితంగా లాభం ఉంది. ఆంధ్రలో సామాన్యప్రజలకు అట్టే లాభం లేకపోవోచ్చు కానీ నష్టం కూడా లేదు. సాటి భారతీయులయిన తెలంగాణా వారికి లాభం జరిగుతుందనే సంతోషం మాత్రం కలుగుతుంది.

      మీకో ప్రశ్న. తెలంగాణా ఏర్పడితే నష్టం జరుగుతుందని అనుకుంటున్నారా? అదేమిటి?

      తొలగించండి
  3. నష్టం గురించి నా లాంటి సామాన్యులకు చింత లేదు ... ఎందుకంటే పది సంవత్సరాల క్రితం పది రూపాయలకు కొన్న బియ్యం ఇప్పుడు నలభై రూపాయలకు కొంటున్నాం ... ఇప్పుడు ప్రత్యెక రాష్ట్రాల ఏర్పాటు వల్ల ప్రభుత్వ ఖర్చుల భారం పడి మహా అయితే వందకు కొంటాం ... ఇరవై సంవత్సరాల క్రితం 4% అమ్మకపు పన్నును విలువ ఆధారిత పన్ను పేరుతో 14 % దాటి వసూలు చేస్తున్న అన్నీ మూసుకుని చెల్లించేస్తున్నాం ... ఎప్పుడో మద్య నిషేధ సమయం లో పెట్టిన సర్వీస్ టాక్స్ సాఖోప శాఖలుగా విస్తరించి అన్ని సేవలకూ వర్తిపజేసు కుంటూ పోతుంటే ఒప్పేసుకుని విప్పేసు కుంటు న్నాము ... అసలు ఇవేవి మనకు సమస్యలు కాదు ... మనకు రాష్ట్రం విడి పోతే చాలు ... అభివృద్ధి జరిగిపోతుందని ఎవడో చెబితే నమ్మేస్తున్నాం ... ఇది ఈనాటిది కాదు ... వంద సంవత్సరాల ఉద్యమం ... అనవద్దు దయచేసి ... కాబట్టి నష్టం ఏమిటి ? నష్టం ఎవరికి అని కాకుండా ... కలిసి వుండటం వల్ల వచ్చే లేదా వస్తున్నా నష్టాలు ... విడిపోవడం వల్ల అవి ఏ విధంగా లాభం గా మారతాయి అనేదే నా ప్రశ్న ... ఒక కుటుంబం రెండుగా చీలిపోతే అలా జరగడం ఇష్టం లేని వారికి ఉండే feeling మాత్రమె నాలాంటి వారిది ... అంతకు మించి ఏమీ లేదు ...

    రిప్లయితొలగించండి
  4. Wonderful Article Sir....Impressed....You amazingly described in 5th Paragraph and above article....

    రిప్లయితొలగించండి