17, మే 2014, శనివారం

విజ్ఞత అందించిన విజయం

ఇది తెలుగు దేశం విజయమో, బి జె పి  విజయమో కాదు ... విజ్ఞత ప్రదర్శించి సరి అయిన సమయం లో సరి ఐన రీతిలో స్పందించిన తెలుగు ఓటర్ల విజయం ... ప్రస్తుత పరిస్తితుల్లో తమ గాయాలకు తగిన చికిత్స చేయగల నాయకుదేవరో ప్రజలకు తెలుసు ... అందుకే కసిగా , ఖచ్చితంగా , ఖరా ఖండిగా తమ అభిప్రాయాన్ని , తమ తీర్పునూ తెలియ జేసారు ...


జగన్ గారు అన్నట్టు చంద్ర బాబు గారి ఉచిత హామీలు చూసి ఎవరూ ఓటు వేయలేదు ... మోడీ గారి గాలి చూసీ కూడా ఓటు వేయలేదు ... ఎందుకంటె వారికి తెలుసు ... ఏ నాయకుడు ఎలాంటి వాడో ... ఎవరు మాటల మనిషో ... ఎవరు చేతల మనిషో ... ఇక జగన్ గారి ఓదార్పు యాత్ర వ్యతిరేక దిశలో జరగాలి ... అంటే ఓదార్పు కావలసింది ప్రజలకు కాదు .. అయన గారికే ... కాంగ్రెస్ చిరునామా గల్లంతు అవడం ఊహించని విషయం ఏమీ కాదు కానీ ... ఎవరి కోసం తెలుగు ప్రజలని విడదీశారో ... ఎవరికి మేలు చేసామని చెప్పుకున్నారో , వారు కూడా ఛీ కొట్టారంటే ... ఇది ఆలోచించ వలసిన విషయం ... తెలంగాణా ఇవ్వడం కాదు ... ఇవ్వడానికి కారణ మైన వారే ముఖ్యమని తేల్చి చెప్పారు తెలంగాణా తెలుగు ప్రజలు ...


తమ పరిణతి ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు ప్రజలందరికీ అభినంద నలు తెలియజేస్తూ ... నేను సైతం మీతో .. మీలో ఒకడిగా ....





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి